ఎంట్రన్స్​​కు ఫ్రీ కోచింగ్​

ఎంట్రన్స్​​కు ఫ్రీ కోచింగ్​

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు ‘ స్కీం ఫర్​ ఫ్రీ  కోచింగ్​ ఫర్​ ఎస్సీ అండ్​ ఓబీసీ స్టూడెంట్స్​’ పేరుతో కాంపిటీటివ్​, అకడమిక్​ కోచింగ్​లకు అవసరమైన ఆర్థికసాయం అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 
సీట్ల సంఖ్య: 1500
అర్హత: కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఓబీసీ విద్యార్థులు. అభ్యర్థి రాసే పరీక్షకు సంబంధించి ఇంటర్​, డిగ్రీ, బీటెక్​ లో కనీస మార్కులు సాధించాలి. 
ఫ్రీ కోచింగ్​ ఉన్న ఎగ్జామ్స్​: యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్​ ఏ, బీ ఉద్యోగాలు, ఎస్​ఎస్​బీ, రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ చేపట్టే నియామకాలు. రాష్ట్రాల పబ్లిక్​ సర్వీస్ కమిషన్లు నిర్వహించే ఎగ్జామ్స్​, బ్యాంకింగ్, ఇన్యూరెన్స్​ చేపట్టే ఆఫీసర్​ స్థాయి కొలువులకు సంబంధించిన కోచింగ్​కు ఫీజు చెల్లిస్తారు. 
ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​​: ఐఐటీ జేఈఈ, నీట్​, క్యాట్, క్లాట్​, సీడీఎస్​, ఎన్​డీఏ పరీక్షలకు, జీఆర్​ఈ, శాట్, జీమ్యాట్​, టోఫెల్ లాంటి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ట్రైనింగ్​ ఫీజు
చెల్లిస్తారు. 
స్టైఫండ్​: స్థానిక విద్యార్థులకు రూ.3000, ఔట్​స్టేషన్​ విద్యార్థులకు రూ.6000, దివ్యాంగులకు రూ.2000 స్పెషల్​ ప్రోత్సాహకం అందజేస్తారు. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. 
చివరితేది: 10 సెప్టెంబర్​
వెబ్​సైట్​: www.coaching.dosje.gov.in

ఈ స్కీం రెండు పద్ధతుల్లో అమలు చేస్తారు. మొదటగా గుర్తింపు పొందిన కోచింగ్​ ఇన్​స్టిట్యూట్స్​కు సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు ఎంపిక ఇన్​స్టిట్యూట్​లే చేస్తాయి. రెండో దాంట్లో సంబంధిత మంత్రిత్వశాఖ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇష్టమైన కోచింగ్​ సెంటర్లలో కోచింగ్​​ తీసుకోవచ్చు. ఫీజును రెండు విడతల్లో స్టూడెంట్స్​ బ్యాంక్​ ఖాతాలో జమ చేస్తారు.