రాజ్‌ఘాట్‌కు జీ20 ప్రతినిధులు .. మహాత్మాగాంధీకి నివాళులు

రాజ్‌ఘాట్‌కు జీ20 ప్రతినిధులు .. మహాత్మాగాంధీకి నివాళులు

జీ20 ప్రతినిధులు ఢిల్లీల్లోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. వారందరికి ప్రధాని నరేంద్ర మోదీ ఖాదీ వస్త్రంతో  స్వాగతం పలికారు. రాజ్‌ఘాట్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని జస్టిన్ తదితరులు పాల్గొన్నారు.  మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. 

రాజ్‌ఘాట్‌లోని రాజ్‌ ఘాట్ వద్ద ప్రధాని మోదీ సహా G20 అధినేతలు మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.  ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాతో పాటు... 
ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా, IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ఇతర నాయకులు, ప్రతినిధులు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.