గోదావరిఖని, వెలుగు: కరెంట్సప్లై విషయంలో సమాధానం చెప్పినప్పటికీ తనను బూతులు తిడుతూ చంపుతానని బెదిరించిన రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రాముపై కరెంట్ఉద్యోగులు బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా కార్పొరేటర్ రాము తనకు ఫోన్ చేసి కరెంట్ ఎప్పుడు వస్తుందని అడిగాడని రామగుండం–మల్యాలపల్లి 33 కేవీ సబ్స్టేషన్ నుంచి ఇన్కమింగ్ లేదని సమాధానమిచ్చినట్లు గోదావరిఖని ఈస్ట్ సెక్షన్ లైన్మెన్ రాచకట్ల శ్రీనివాస్ తెలిపారు.
కాగా తాను సమాధానం చెప్పినా వినకుండా బూతులు తిడుతూ చంపుతానని బెదిరిస్తూ తన విధులకు ఆటంకం కలిగించాడని బాధితుడు తెలిపారు. ఈ విషయంలో విచారణ చేసి కార్పొరేటర్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు.
