సెక్రటేరియట్లో కొత్త మంత్రులకు ఛాంబర్లు..ఏ ఫ్లోర్లో ఎవరంటే..?

సెక్రటేరియట్లో కొత్త మంత్రులకు ఛాంబర్లు..ఏ ఫ్లోర్లో ఎవరంటే..?

కొత్త మంత్రులకు సెక్రటేరియట్ లో ఛాంబర్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. భట్టి విక్రమార్కకు కేటాయించిన ఫైనాన్స్  శాఖకు సంబంధించిన చాంబర్ సెక్రటేరియట్ లోని సెకండ్ ఫ్లోర్ లో కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించిన సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖలకు చెందిన చాంబర్లు ఫోర్త్ ఫ్లోర్ లో కేటాయించారు.

హెల్త్ అండ్ మెడికల్ చాంబర్ సెకండ్ ఫ్లోర్, ఆర్ అండ్ బీ శాఖ ఫిప్త్ ఫ్లోర్. ఐటీ శాఖ థర్డ్ ఫ్లోర్, రెవెన్యూ, హౌసింగ్ శాఖ గ్రౌండ్ ఫ్లోర్ లో కేటాయించారు. పొన్నం ప్రభాకర్ కు కేటాయించిన బీసీ వెల్ఫేర్ శాఖను 5వ ఫ్లోర్ కాగా..అటవీశాఖ చాంబర్ 4వ ఫ్లోర్ లో కేటాయించారు. ఉమెన్ వెల్ఫేర్ ఫస్ట్ ఫ్లోర్, అగ్రికల్చర్ కు సంబంధించిన చాంబర్ థర్డ్ ఫ్లో ర్ లో కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు కేటాయించిన ఎక్సైజ్ శాఖ చాంబర్ ను సెక్రటేరియట్ లోని నాలుగో ఫ్లోర్ కేటాయించారు.