రాజస్థాన్లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తప్పించారు. చదువుల తల్లి సరస్వతీ దేవిని అగౌరవపరచినందుకు రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకుటీచర్ హేమలతా బైర్వానును శనివారం ( ఫిబ్రవరి 24) సస్పెండ్ చేశారు. విద్యార్థులు సరస్వతిదేవిని కొలుస్తారు. చాలా స్కూళ్లలో సరస్వతి నమస్తుభ్యం అని కూడా పాఠశాల ప్రార్థనలో ఈ శ్లోకాన్ని చదివిస్తారు.
స్కూళ్లలో సరస్వతి దేవి వల్ల ఉపయోగం ఏమిటని టీచర్ ప్రశ్నించారు. పిల్లలకు సరస్వతి దేవి సహకారం ఏమీ ఉండదని చెప్పడంతో ... మత పరమైనన భావాలను రెచ్చగొట్టే విధంగా బరాన్ జిల్లాలోని కిషన్ గంజ్ ప్రాంతంలో గురువారం( ఫిబ్రవరి 22)న ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. దీంతో లక్డై గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రబోధక్ లెవల్ 1 టీచర్ హేమలత బైర్వాను సస్పెండ్ చేస్తూ బరన్ జిల్లా విద్యా (ప్రాథమిక) అధికారి ఉత్తర్వులు జారీ చేశారు