ఓల్డ్సిటీ, వెలుగు: చాంద్రాయణగుట్ట బర్కస్ పరిధిలోని శ్రీ ద్విముఖి హనుమాన్ దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల ప్రతినిధులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
