
- మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: మరమ్మతుల విషయంలో మేడిగడ్డకు ఒక నీతి.. సుంకిశాలకు ఇంకో నీతా? అని మాజీ మంత్రి హరీశ్ రావురాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశమున్నా.. బీఆర్ఎస్ను బద్నాం చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సుంకిశాల విషయంలో లోపాలు ఎక్కడ బయట పడతాయోనని గుట్టు చప్పుడు కాకుండా రిపేర్లు మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు. “సుంకిశాల మీద ఎక్స్పర్ట్స్ కమిటీ ఎంక్వైరీ ఉండదు. విజిలెన్స్ కమిషన్ విచారణ ఉండదు. జ్యుడీషియల్ కమిషన్ ఉండదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. ఇవేమి లేకుండా సైలెంట్ గా రిపేర్లు చేస్తారు’’ అని సోమవారం ఎక్స్వేదికగా ఆయన విమర్శించారు.
అదే మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగితే అన్నీ ఉంటాయని ఆయన అన్నారు. ఎన్డీఎస్ఏ, ఎక్స్పర్ట్ కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్స్, ఇంకా వివిధ సంస్థలు ఆ పియర్స్ ను రిపేర్ చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినా.. కన్స్ట్రక్షన్ కంపెనీ రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. కేవలం రాజకీయ స్వార్థం తో తెలంగాణ ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టడం, కాంగ్రెస్ మార్కు “ప్రజా వ్యతిరేక-ప్రతిపక్ష వేధింపు’’ పాలనకు నిదర్శనం అని హరీశ్ రావు పేర్కొన్నారు.