రైల్వే స్టేషన్లలో తాగునీటిపై కీలక చర్యలు..అధికారులతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ

రైల్వే స్టేషన్లలో తాగునీటిపై కీలక చర్యలు..అధికారులతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ

న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్లలో తాగునీటి క్వాలిటీపై కాగ్‌‌ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ అలర్ట్​ అయింది. ప్రయాణికులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధికారులను ఆదేశించారు. 

రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓతో పాటు ఉన్నతాధికారులతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్​వర్క్​లోని సుమారు 20 వేల ప్రాంతాల్లో ‘ట్యాంక్‌ టు ట్యాప్‌’ వాటర్‌ ఫిల్ట్రేషన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.