టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో హర్వీందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. ఇది వరకు 2018 ఆసియా పారా క్రీడల్లో మొదటి సారి గోల్డ్ మెడల సాధించిన హర్విందర్ ఇప్పుడు వలర్డ్ స్పోర్ట్స్ లోనూ సత్తా చాటాడు.
కొరియాకు చెందిన పారా అథ్లెట్ కిమ్ మిను సూతో జరిగిన కాంస్య పతక పోరులో 6-5 తేడాతో ఓడించిన హర్వీందర్ సింగ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.