ఉత్తర భారతంలో మంచు దుప్పటి కనువిందు చేస్తోంది. మంచు అందాలు ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలోని సిమ్లా, డోడా, లాహుల్, నార్కండ, కులు, మనాలీ, కుఫ్రీ, కిన్నౌర్ సహా పలు ప్రాంతాలను భారీగా మంచు కురుస్తోంది. నార్కండ ప్రాంతంలో దాదాపు నాలుగు అంగుళాల వరకు మంచు పేరుకుపోయింది. ఇక్కడికి వస్తున్న సందర్శకులు సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు.