ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు . గణనాథుడి దర్శనానికి చివరి రోజు కావడంతో నగరం నలు దిక్కుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు. తరలివచ్చిన భక్తులతో వినాయక మండపం పరిసరాలు రద్దీగా కనిపించాయి. 

భక్తులు క్యూలైనల్లో వేచి చూసిన అనంతరం మహాగణపతిని దర్శించుకుంటున్నారు.  కాగా ఈ సారి ‘శ్రీ దశమహా విద్యా గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ గణనాథుడు.  స్వామి వారికి కుడివైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు.