
- ముఠాపై 178 కేసులు..అందులో 74 మన రాష్ట్రంలోనే
- 37 మంది నిందితుల్లో18 మంది తెలంగాణ వాసులు
హైదరాబాద్సిటీ, వెలుగు: తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. 37 మంది నిందితుల నుంచి రూ.14 కోట్ల 54 లక్షల 57 వేలు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ గ్యాంగ్పై 178 కేసులుండగా అందులో 74 కేసులు మన రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇన్వెస్ట్మెంట్ల పేరుతో మోసాలు, మహిళలను సోషల్ మీడియా ద్వారా వేధించడం వంటి నేరాలకు పాల్పడే వారు.
అరెస్టైన నిందితుల్లో అత్యధికంగా తెలంగాణ నుంచి 18 మంది, ఏపీ నుంచి ఐదుగురు, ఢిల్లీ వాసులు ఐదుగురు, యూపీ, గుజరాత్, హర్యానా నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. నిందితుల నుంచి -74 మొబైల్ ఫోన్స్, 156 చెక్ బుక్స్-, -11 డెబిట్ కార్డులు, 22 సిమ్ కార్డులు-, 8 బ్యాంక్ పాస్ బుక్స్, 5 రబ్బర్ స్టాంపులు-, 115 షెల్ కంపెనీల స్టాంపులు-, 11 ల్యాప్టాప్లు, రెండు ఓటీపీ డిటెక్టర్లు, రెండు క్యూఆర్ కోడ్ స్కానర్లు-, రెండు పాన్ కార్డులు-, 26 ఆధార్ కార్డులు, ఒక స్వైప్ మెషిన్- స్వాధీనం చేసుకున్నారు.