
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 26 నుంచి నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో సిటీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్కు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని మొత్తం ఐదు జోన్లు.. చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బి నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లిలో ఉదయం వేళల్లో పొగమంచు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అలాగే చలిని తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.