ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చేది కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. తొలి వన్డేలో భారత్ పది వికెట్లతో విజయం సాధించగా, రెండో వన్డేలో 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్ కి వెన్నులో గాయం కారణంగా బుమ్రా దూరమయ్యాడు.
టీమ్స్ :
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, సిరాజ్, చాహల్, ప్రసిధ్ కృష్ణ
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జానీ బెయిర్స్టో, జో రూట్, బెన్స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, ఓవర్టన్, డేవిడ్ విల్లే, కార్సే, టోప్లే