ఇండియన్ ఫుట్బాల్ టీమ్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి సారిగా FIFAe నేషన్స్ కప్ 2022 టోర్నీకి ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. FIFAe నేషన్స్ సిరీస్ 2022 ప్లే ఆఫ్ మ్యాచుల్లో భారత ఈఫుట్బాల్ టీమ్ కొరియా రిపబ్లిక్, మలేషియా జట్లను ఓడించి అర్హత పొందింది. ఈస్పోర్ట్స్ షోపీస్ ఈవెంట్ జూలై 27 నుంచి 30 వరకు డెన్మార్క్ లోని కోపెన్ హాగల్లో జరగనుంది.
Copenhagen, here we come !!
— Indian Football Team (@IndianFootball) June 11, 2022
India ?? creates history by qualifying for the first time ever to the pinnacle event of FIFA eSports - FIFAe Nations Cup 2022#FeNS22 ? #FeNC ? #eTigers ? #IndianFootballForwardTogether ? pic.twitter.com/PIQJT3xNG1
FIFAe నేషన్స్ సిరీస్ 2021 కోసం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ FIFAతో భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. దీంతో గత ఏడాది జనవరిలో ఇండియన్ ఫుట్బాల్ టీమ్ ఈస్పోర్ట్స్ షోపీస్ ఈవెంట్లో స్థానమే లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించింది. భారత ఫుట్బాల్ జట్టు 60 దేశాలతో కలిసి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా జోన్లో ప్లేస్ దక్కించుకుంది. ఈ జోన్లో టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో FIFAe నేషన్స్ ప్లేఆఫ్ 2021లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే గ్లోబల్ ర్యాంకింగ్లో మాత్రం 22వ స్థానంతో సీజన్ను ముగించింది.
.@chelseaCJ12 , @Jenasidfc and @saransh_jain7 will represent Team India ?? in the FIFAe Nations PlayOffs 2022 as they
— Indian Football Team (@IndianFootball) June 10, 2022
look to seal a spot in the prestigious FIFAe Nations Cup!
Read ? https://t.co/FTtIZEbETb#FeNS22 ? #FeNPO22 ? #eTigers ? #indianfootballforwardtogether ? pic.twitter.com/4YOSiihwHs
2022 సీజన్ కోసం భారత జట్టు ఆసియా,ఓసియానియా జోన్కు మారింది. నాలుగు వారాల పాటు జరిగిన ప్లేఆఫ్లో భారత్ 32 గేమ్స్ లో ఆడింది. ఇందులో 12 గేమ్స్లో గెలిచి..11 గేమ్స్ ఓడింది. తొమ్మిదింటిని డ్రాగా ముగించింది. దీంతో కాన్సిస్టెన్సీ పాయింట్ల చార్ట్లో భారత్ రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు అర్హత సాధించింది. అటు గ్లోబల్ ర్యాంకింగ్ లో19వ ప్లేస్ ను దక్కించుకుంది. ఇక ప్లేఆఫ్లో రెండు మ్యాచుల్లో గెలిచి..FIFAe నేషన్స్ కప్ 2022కి అర్హత పొందింది.
