పాక్ బౌలర్లలో పస లేదు.. దంచి కొడుతున్న రాహుల్, కోహ్లీ

పాక్ బౌలర్లలో పస లేదు.. దంచి కొడుతున్న రాహుల్, కోహ్లీ

కీలక మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. పస లేని పాకిస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. వ‌రుణుడు శాంతించ‌డంతో రిజ‌ర్వ్ డే రోజు ఆట తిరిగి ప్రారంభం కాగా, కేఎల్ రాహుల్(72)- విరాట్ కోహ్లీ(57) జోడి టీమిండియాను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. 

ఫ‌హీన్ అష్ర‌ఫ్ ఓవ‌ర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ మార్క్ చేరుకున్న కేఎల్ రాహుల్(50 నాటౌట్ 60 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌).. అనంతరం దూకుడు పెంచాడు. స్పిన్న‌ర్ షాదాబ్ ఖాన్ వేసిన 35వ ఓవ‌ర్లో వ‌రుస‌గా ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు 55 బంతుల్లో కోహ్లీ.. తన 66వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతానికి 40 ఓవర్లు ముగిసేసరికి.. భార‌త్ స్కోర్..  251-2.