సెకండ్ టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన భారత్

సెకండ్ టెస్టులో తొలి వికెట్ కోల్పోయిన భారత్

 శ్రీలంకతో జరుగుతున్న సెకండ్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వ్యక్తిగత స్కోరు 4 వద్ద రనౌట్ అయ్యాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 23 రన్స్ చేసింది. క్రీజులో రోహిత్ శర్మ 15, హనుమ విహారి 2 పరుగులతో ఉన్నారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ గెలవాలని భారత్ చూస్తోంది. ఈ మ్యాచ్ అయినా గెలిచి సిరీస్ ను డ్రా చేసి పరువు నిలబెట్టుకోవాలని శ్రీలంక చూస్తోంది.