
టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో స్పిరిట్ అనే చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే కల్కీ చిత్రం సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే దర్శకుడు సందీప్ రెడ్డి స్పిరిట్ చిత్రంలోని పాత్రలపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ దంపతులను నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే స్పిరిట్ చిత్రంలో ఈ స్టార్ కపుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
అంతేగాకుండా త్వరలోనే స్పిరిట్ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుండటంతో మొదటగా సైఫ్ దంపతులకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకకరించనున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ALSO READ | ప్రభాస్ స్పిరిట్ లో బాలీవుడ్ స్టార్ కపుల్స్
గతంలో సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రలో నటించాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. కానీ సైఫ్ అలీ ఖాన్ కి మాత్రం విలన్ పాత్రల్లో నటించే అవకాశాలు తెచ్చిపెట్టింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం విల్లన్ పాత్రల్లో నటించడానికి కూడా ఒకే చెబుతున్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా సైఫ్ అలీ ఖాన్ తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ మరియు ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.