
- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
రాయికల్, వెలుగు: రాయికల్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. రాయికల్ పట్టణంలో మంగళవారం ఆయన పర్యటించారు. పలు వార్డుల్లో కాలినడకన తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం గుడేటిరెడ్డి సంఘ భవనంలో మండలానికి చెందిన 67 మంది లబ్ధిదారులకు రూ.19.60లక్షల విలువైన సీఎం సహాయనిధి, 71 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయికల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పాత బకాయిలు రూ. 3కోట్లు మంజూరు చేయించానని, కొత్తగా మరో రూ.3కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఎఇ ప్రసాద్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గన్నె రాజిరెడ్డి, రవీందర్ రావు, పడిగేల రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్, అనుపురం శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్ పాల్గొన్నారు.