
సినిమాల్లోనే కాదు టీవీల్లోనూ స్టాండప్ కామెడీ షోలు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. తెలుగు ఆడియెన్స్ని కడుపుబ్బా నవ్వించేందుకు త్వరలోనే కొత్త స్టాండప్ కామెడీ షో రాబోతోంది. ఈ షో పేరు ‘జాతిరత్నాలు’. దీనికి శ్రీముఖి హోస్ట్. ఈమధ్యే ఈ షో టీజర్ వచ్చింది. అందులో శ్రీముఖి ‘రాను అనుకున్నారా? రాలేననుకున్నారా? రాముల ఈజ్ బ్యాక్. ఇదొక కొత్త రకం కామెడీ షో. నవ్వడానికి రెడీగా ఉండండి’ అంటూ చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేశాయి. దాదాపు 60 మంది స్టాండప్ కమెడియన్స్ తమ స్టైల్ కామెడీతో ఎంటర్టైన్ చేయనున్నారు. ఈ షో త్వరలోనే ఈటీవీ ప్లస్లో ఏప్రిల్ 4 నుంచి టెలికాస్ట్ అవుతుందని టాక్.