
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తెలంగాణకు కుటుంబ పెద్దే అయితే.. దళితులను సీఎం చేస్తానని చేయకుండా ఎందుకు దగా చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి ఇవ్వకపోగా అడవి బిడ్డలపై కేసులు ఎందుకు పెట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా ట్వీట్ చేశారు.
‘‘సాకులు చూపి నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులను ఎందుకు వంచించారు? ఫుడ్ పాయిజన్ అయ్యి స్టూడెంట్స్ ఆస్పత్రి పాలవుతుంటే మంచి ఫుడ్ ఎందుకు పెట్టించట్లేదు? ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు స్పందించరు? మోదీ సభకు వచ్చిన ప్రజా స్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం అవుతున్నది. చిన్న ట్రైలర్కే గజగజ వణికిపోతుం టే.. రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితేంటో’’ అని పేర్కొన్నారు.