
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు: జిల్లాలోని గ్రామాలు, టౌన్లలో ఎండకాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కామారెడ్డి కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం తన చాంబర్లో మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి ఎద్దడిపై రివ్యూ చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ సిబ్బంది అలర్ట్గా ఉండాలన్నారు. తాగునీటి స్కీమ్లకు ఏమైనా రిపేర్ ఉంటే చేయించాలన్నారు. పైపులైన్లపై లీకేజీలు అరికట్టాలన్నారు. అధికారులు కో అర్డినేషన్తో పని చేయాలన్నారు. మిషన్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, అధికారులు స్వప్న, నరేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై స్టేట్ఎలక్షన్ అధికారి సుదర్మన్ రెడ్డి శుక్రవారం ఆయా జిల్లాల అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, బ్యాలట్బాక్సులు, పోలింగ్రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర ఆంశాలపై చర్చించారు. జిల్లాలో గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 54 పోలింగ్బూత్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్రెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి టౌన్లో రోడ్లపై చెత్తవేయకుండా అవగాహన కల్పించాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్, రామారెడ్డి రోడ్డు ఏరియాల్లో కలెక్టర్పర్యటించి, శానిటేషన్ పరిస్థితిని పరిశీలించారు. ఇంటింట చెత్త సేకరణను ప్రతి రోజు నిర్వహించాలన్నారు. ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించాలన్నారు. రోడ్లకు ఇరువైపుల నాలల్లో ఉన్న చెత్తను తొలగించాలన్నారు. ట్యాక్సులు 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కమిషనర్ రాజేందర్రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఏఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.