
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాల గడువు బుధవారం ముగిసింది. ఈ నెల 4న 60డివిజన్లు ఏర్పాటు చేస్తూ ముసాయిదాను అధికారులు రిలీజ్ చేశారు. వారం రోజుల పాటు స్వీకరించారు. కాగా, కార్పొరేషన్ డివిజన్ల ఏర్పాటుపై ఈ నెల 21న తుది ముసాయిదా రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఆఫీసర్లు కసరత్తు మొదలు పెట్టారు.