కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు

కొత్తగూడెం కార్పొరేషన్ డివిజన్లపై  50కి పైగా అభ్యంతరాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం ​కార్పొరేషన్​ డివిజన్లపై 50కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. డివిజన్ల ఏర్పాటుపై అభ్యంతరాల గడువు బుధవారం ముగిసింది.  ఈ నెల 4న 60డివిజన్లు ఏర్పాటు చేస్తూ  ముసాయిదాను అధికారులు రిలీజ్ ​చేశారు. వారం రోజుల పాటు స్వీకరించారు.  కాగా, కార్పొరేషన్​ డివిజన్ల ఏర్పాటుపై ఈ నెల 21న తుది ముసాయిదా రిలీజ్​ కానుంది. ఇందుకు సంబంధించి ఆఫీసర్లు కసరత్తు మొదలు పెట్టారు.