
ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలోని 10 ప్రైవేటు ఆసుపత్రుల కొవిడ్ లైసెన్స్ను ఆదివారం రద్దు చేశారు. జిల్లాలో 49 హాస్పిటల్స్ను కొవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం అనుమతించింది. వీటిలో ఖమ్మంలోని విశ్వాల్మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, క్యూర్, ప్రశాంతి, మార్వెల్, జనని చిల్డ్రన్హాస్పిటల్, ఇండస్, విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ, శ్రీ బాలాజీ చెస్ట్, డయాబేటాలజీ సెంటర్, న్యూ హోప్, సంకల్ప సీ స్టార్ హాస్పిటల్స్ లైసెన్స్రద్దు చేశారు. ఈ పది ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ను అతిక్రమించినట్లు టాస్క్ఫోర్స్బృందం నిర్ధారించిందని, అందువల్ల ఆయా ఆసుపత్రులకు జారీ చేసిన కొవిడ్సేవల అనుమతులను రద్దు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాలతి చెప్పారు. జిల్లాలో టాస్క్ఫోర్స్, వైద్య ఆరోగ్య సంయుక్త బృందం ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించామని, పలు ఆసుపత్రుల్లో ఫీజుల వివరాల పట్టిక లేకపోవడాన్ని అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఫీజులు అధికంగా వసూలు చేయడం, కేసు షీటులో పరీక్షల వివరాలు, రోగి వాడుతున్న మందుల వివరాలను అసమగ్రంగా నమోదు చేయడాన్ని గుర్తించామన్నారు. బాధితులకు ఫీజులకు సంబంధించి సరైన బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఆయా ఆసుపత్రుల్లో ఇప్పుడున్న రోగులను ఇతర హాస్పిటల్స్కు తరలించనున్నట్లు చెప్పారు.