
భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆహ్వానపత్రికను కోయభాషలో రూపొందించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార, వ్యవహారాలు అంతరించి పోకుండా, భాషా సంస్కృతిపై నేటి యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతోనే కోయభాషలో ఆహ్వాన పత్రికలు ముద్రించినట్లు పీవో రాహుల్ తెలిపారు. గిరిజనులకు మరింత చేరువయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కోయభాషలో ఆహ్వాన పత్రిక ముద్రించడాన్ని గిరిజన ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు అభినందించారు.