హైదరాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం కురుమలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కురుమ యువ చైతన్య సమితి (కేవైసీఎస్) స్టేట్ ప్రెసిడెంట్ గొరిగి నరసింహ కోరారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి.. అర్హులైన కురుమలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం వెనుకబడిన వర్గంగా ఉన్న కురుమలకు రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలన్నారు. వేములవాడలో తుల ఉమకు, జనగామలో బీరప్ప బేజాడి కురుమకు, మక్తల్లో శంకరొల్ల రవి కుమార్ కురుమకు, సనత్ నగర్లో చీర శ్రీకాంత్ కురుమకు, రాజేంద్ర నగర్లో బైతి శ్రీధర్ కురుమకు, నాగర్ కర్నూల్ లో కొండ మణెమ్మ నగేష్ కురుమకు టికెట్ ఇవ్వాలని కోరారు.