ఒక్క  అంగుళం కూడా చైనా ఆక్రమించలే లడఖ్ ఎల్‌‌జీ బీడీ మిశ్రా 

ఒక్క  అంగుళం కూడా చైనా ఆక్రమించలే లడఖ్ ఎల్‌‌జీ బీడీ మిశ్రా 

శ్రీనగర్: మన దేశ భూభాగంలో ఒక్క చదరపు అంగుళం కూడా చైనా ఆక్రమిం చలేదని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా వెల్లడించారు. బార్డర్ లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మన దేశ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు. ఇటీవల రాహుల్ గాంధీ లడఖ్‌‌లో పర్యటించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నా మోదీ సర్కారు నోరుమెదపట్లేదని విమర్శించా రు.

 సోమవారం లడఖ్‌‌లో ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎల్జీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...“ఎవరి కామెంట్లను ఉద్దేశించిన నేను మాట్లడటం లేదు. మన దేశంలోని  ఒక్క చదరపు అంగుళం  భూమిని కూడా చైనా ఆక్రమించలేదు. నేరుగా అక్కడికి వెళ్లి చూశాకే వాస్తవం చెబుతున్నాను"అని పేర్కొన్నారు.