రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం నడుస్తున్నది

రాష్ట్రంలో పోలీస్​ రాజ్యం నడుస్తున్నది
  •     కాంగ్రెస్ నేత మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి ఆరోపించారు. సీఎం, మంత్రుల పర్యటనలుంటే ప్రతిపక్షాలను హౌస్​ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని..ఇతర పథకాలేమీ అందట్లేదని నిలదీస్తే ఉపా కేసులు పెడ్తున్నారని విమర్శించారు. ఇటీవలే ప్రొఫెసర్ హరగోపాల్ సహా 152 మంది మీద ఉపా కేసు పెట్టారని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి సహా వివిధ ప్రాజెక్టుల మీద ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక హరగోపాల్ అని అన్నారు. ఉపా కేసులు ఎత్తేయాలని సీఎం ఆదేశాలివ్వడం మంచి పరిణామమని, అదే సమయంలో వారిపై కేసులు పెట్టిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.