ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ కుట్ర:సిసోడియా

ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ కుట్ర:సిసోడియా

ఢిల్లీలో 43 మంది MLAలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.  తెలంగాణలోనూ 100కోట్లతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగాయంటూ ట్వీట్ చేశారు.  ఢిల్లీలో 25 కోట్లతో ఒక్కో ఎమ్మెల్యేను కొనేందుకు డబ్బులు ఉంచినట్టు బ్రోకర్ ఒప్పుకున్నాడన్నారు.  43 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు 10 వందల 75 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు మనీష్ సిసోడియా. 

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు తమకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇంత వరకు పోలీసుల ఎఫ్ఐఆర్ లో ఆ రూ.100కోట్ల ప్రస్తావన లేదు. అసలు ఫాంహౌజ్ లో డబ్బులు పట్టుకున్నట్లు పోలీసులు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఇచ్చి కొనుగోలుకు యత్నించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.