మైనార్టీలను మోసం చేసే కుట్ర

మైనార్టీలను మోసం చేసే కుట్ర

హైదరాబాద్, వెలుగు:  ఓట్ల కోసమే మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారని బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది ముమ్మాటికీ మైనార్టీలను మోసం చేయడమేనని మండిపడ్డారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ముస్లిం మైనార్టీలకు ఆర్థిక సహాయం చేస్తే.. ఇతర మైనార్టీ వర్గాలైన బుద్ధిస్టు, సిక్కుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అందరికీ సహాయం చేస్తున్నదన్నారు. పస్మందా కింద  మైనార్టీలకు బీజేపీ ఆర్థిక సహాయం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. వృద్ధాప్య పెన్షన్ల వయస్సు తగ్గిస్తామని ప్రకటించి ఇప్పటివరకు తగ్గించలేదన్నారు