
- ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంట: మంత్రి వివేక్ వెంకటస్వామి
- రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను విజిట్ చేస్త
- సరైన సౌకర్యాలు అందేలా చూస్త
- ఉద్యోగావకాశాలు దక్కేలా స్టూడెంట్లను తీర్చిదిద్దాలి
- ఐటీఐ ప్రిన్సిపాల్స్ ఓరియంటేషన్ వర్క్షాప్లో సూచన
అంబర్పేట్, వెలుగు: నూతనంగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐటీఐలు దేశంలోనే నంబర్ వన్ కావాలని ఆయన ఆకాంక్షించారు. మందమర్రిలాంటి ఐటీఐలలో సరైన సౌకర్యాలు లేవని తెలిసిందని, అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను విజిట్ చేస్తానన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఏటీఐ) లో మూడు రోజులుగా జరుగుతున్న ఐటీఐ ప్రిన్సిపాల్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్ గురువారం ముగిసింది.
ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమానికి వచ్చాను. మా నాన్న వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఐటీఐ సెక్టార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది” అని తెలిపారు. ఫ్యాకల్టీని పెంచి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేలా ప్రిన్సిపాల్స్ దృష్టి పెట్టాలని, విద్యార్థులకు మంచి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా చేయాలని సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలలో సౌకర్యాలు, కొత్త కోర్సుల కోసం సెంట్రల్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.