తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. గురువారం హైదరాబాద్​లో మంత్రిని కలిసి నర్సంపేట నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల 4వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం తడిసిందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంట నర్సంపేట వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్​ కిసాన్​ సెల్​వరంగల్​ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్​రావు పాల్గొన్నారు.