
- దోషులుగా చేయడం సరికాదు
- కేసీఆర్కు ఏం తెలియదని చెప్పడం ఏంటీ?
- ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్: మావోయిస్టులను ఉగ్రవాదుల కంటే దారుణంగా మోదీ సర్కార్ చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉందని.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ దే పాత్ర ఉందని తమకు ఏం తెలియదని అనడం సరికాదన్నారు.
‘ కాళేశ్వరంలో ఇంజినర్లను దోషులుగా చేయుద్దు . ఇందులో కేసీఆర్కు తెలియని విషయం ఏమైనా ఉందా? కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నాం.. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం ఫెయిల్ అయింది.. మాజీ సీఎం ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతోంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దు.’ అని అని కూనంనేని అన్నారు.
►ALSO READ | యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై తిరగబడ్డ స్థానికులు