మావోయిస్టులు ఉగ్రవాదుల కంటే ప్రమాదమా.?: ఎమ్మెల్యే కూనంనేని

మావోయిస్టులు ఉగ్రవాదుల కంటే ప్రమాదమా.?: ఎమ్మెల్యే కూనంనేని
  • దోషులుగా చేయడం సరికాదు 
  • కేసీఆర్​కు ఏం తెలియదని చెప్పడం ఏంటీ? 
  •  ఎమ్మెల్యే  కూనంనేని

హైదరాబాద్​:  మావోయిస్టులను ఉగ్రవాదుల కంటే దారుణంగా మోదీ సర్కార్​ చూస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ  సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉందని.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదన్నారు.   కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్స్ దే పాత్ర ఉందని తమకు ఏం తెలియదని అనడం సరికాదన్నారు.

  ‘  కాళేశ్వరంలో ఇంజినర్లను దోషులుగా చేయుద్దు .  ఇందులో కేసీఆర్​కు తెలియని విషయం ఏమైనా ఉందా? కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలుపుతున్నాం.. ఈ ప్రమాద ఘటనపై కేంద్రం ఫెయిల్ అయింది.. మాజీ సీఎం  ప్రమాదంలో మరణించడం దురదృష్టకరం.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీర్చలేక కుంగిపోతోంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయవద్దు.’ అని  అని కూనంనేని అన్నారు.

►ALSO READ | యాకుత్‎పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌‎పై తిరగబడ్డ స్థానికులు