
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ నేత, యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై స్థానికులు తిరగబడ్డారు. మధ్యలో అడ్డువచ్చిన ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు చితకబాదారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో యాకుత్పురాలో ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఇటీవల హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లాయి. చాలా ప్రాంతాల్లో నీరు రోడ్లపైనే నిల్వ ఉంది. ఈ క్రమంలో యాకుత్పురా నియోజకవర్గ పరిధిలోని నాలా పనులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ శుక్రవారం (జూన్ 13) వెళ్లారు.
నాలా సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ను స్థానికులు నిలదీశారు. వానాకాలం వచ్చినా కూడా నాలా పనులు చేయడం లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, స్థానికులు మధ్య వాగ్వాదం జరిగింది.
►ALSO READ | ఫార్ములా ఈ కార్ రేస్ కేస్: కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
ఎమ్మెల్యే అనుచరులు స్థానికులతో ఘర్షణకు దిగారు. మాటమాట పెరిగి స్థానికులు, ఎమ్మెల్యే అనుచరులు పరస్పరం బాహాబాహీకి దిగారు. ఈ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎమ్మెల్యేపై స్థానికులు తిరగబడ్డ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించిన స్థానికులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేయడమేంటని నెటిజన్లు ఏకిపారేస్తు్న్నారు.