
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2025, జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణ రావాలని ఆదేశించింది. గతంలోనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపగా.. విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని అధికారులు ఆయన సమాచారం అందించారు. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.
►ALSO READ | ఏ లక్కీ నెంబర్ అయితే ముఖ్యమంత్రిని చేసిందో.. అదే లక్కీ నెంబర్ రోజే ప్రాణాలు పోయాయి!
ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ ఏ2, బీఎల్ ఎన్ రెడ్డిని ఏ3 నిందితులుగా ఏసీబీ చేర్చింది. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. ఇదే కేసులో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరీ ఈసారైనా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా చూడాలి.