
విజయ్ రూపాణీ ఆయన గుజరాత్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. గురువారం నాడు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆయన కూడా ప్రయాణించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా జరిగిన విమాన ప్రమాదంలో ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవానికి విజయ్ రూపాణీ 1206ను తన అదృష్ట సంఖ్యగా తన జీవితంలో ఫాలో అయ్యారు. ఆయనను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆయన వాహనాలు, స్కూటర్, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అధికారిక వాహనం కూడా 1206 నంబర్ ప్లేట్ కలిగి ఉండటం మనం చూడొచ్చు. అయితే అనుకోకుండా 12/06 తేదీన తన కుమార్తె, భార్యను కలిసేందుకు లండన్ ప్రయాణించేందుకు ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోవటం ఆయన మరణానికి దారితీసింది.
మృదు స్వభావిగా పేరున్న ఆయన ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన లక్కీనంబరుగా భావించే రోజునే రూపాణి మృతి చెందటం బీజేపీ శ్రేణులను విషాదానికి గురిచేసింది. దీంతో ప్రస్తుతం ఆయన ఉపయోగించిన స్కూటర్ నుంచి కారు వరకు అన్నింటి రిజిస్ట్రేషన్ నంబర్ 1206 గా ఉన్న వాహనాల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ వరకు ఎదిగిన ఆయన.. 1956 ఆగస్టు 2 న మయన్మార్ లోని యాంగూన్ ప్రాంతంలో పుట్టారు. ఆయన ఆయన చిన్నప్పుడే ఫ్యామిలీ ఇండియాలోని రాజ్కోట్ లో స్థిరపడింది.
విజయ్ రూపానీ నేపథ్యం:
1956 ఆగస్టు 2న మయబెన్, రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు ఎడవ సంతానంగా జన్మించాడు విజయ్ రూపానీ. వీరు మయన్మార్లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందిన వారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ కుటుంబం 1960 లో రాజ్కోట్కు వలస వచ్చింది. విజయ్ రూపానీ ధర్మేంద్రసింగ్ జీ ఆర్ట్స్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి కంప్లీట్ చేశాడు. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థ ఏబీపీవీలో విజయ్ రూపానీ కార్యకర్తగా పని చేశారు.
►ALSO READ | విమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు
అనంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ (RMC) కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1997 వరకు రాజ్కోట్ మేయర్గా పనిచేశారు. 1998లో గుజరాత్ యూనిట్ బీజేపీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్గా, 2013లో భారతదేశ ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ మున్సిపల్ ఫైనాన్స్ బోర్డు ఛైర్మన్గా విజయ్ రూపానీ పని చేశారు. జూలై 2006 నుంచి జూలై 2012 వరకు విజయ్ రూపానీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఆనందిబెన్ పటేల్ కేబినెట్లో నవంబర్ 2014 నుంచి ఆగస్టు 2016 వరకు రవాణా, కార్మిక & ఉపాధి, నీటి సరఫరా మంత్రిగా కూడా రూపానీ పనిచేశారు. అనంతరం 2016, ఆగస్టు 7 నుంచి.. 2021, సెప్టెంబర్ 11వరకు వరకు రెండు పర్యాయాలు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ పనిచేశారు. ఆయన రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ బీజేపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021, సెప్టెంబర్లో విజయ్ రూపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.