
నీళ్చిచ్చిన కేసీఆర్ పై నిందలు వేస్తారా అంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులివ్వడానికి నిరసనగా ఇందిరాపార్క్ దగ్గర జాగృతి ఆధ్వర్యంలో ఆమె మహా ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత. . ఏం తప్పు చేశారని కేసీఆర్ కు నోటీసులిచ్చారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తేవడం కేసీఆర్ చేసినా తప్పా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మూడు బ్యారేజ్ లేనా?. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే 21 పంపు హౌస్ లు. 15 రిజర్వాయర్ లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో వాడిన స్టీల్ తో 100 ఈఫీల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వాడిన సిమెంట్ తో 50 బుర్జు ఖలీఫాలు కట్టొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పూర్తి అయితే తెలంగాణ లో 35 శాతం సాగుభూమికి నీళ్ళు ఇవ్వొచ్చు. 141 TMC లు నిల్వ ఉండేలా కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీలో జలయజ్ఞం ధనయజ్ఞం అయింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ పార్టీ ఎన్నడు ఆలోచన చేయలేదు.కేసీఆర్ రాజకీయంగా ఇబ్బంది గురిచేయడం కోసమే నోటీసులు.
Also Read : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఇబ్బందులకు లేకుండా చూడాలి
కేసీఆర్ కు మంచిపేరు రావొద్దని కుట్ర చేస్తున్నారు. ఏపీ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. గోదావరి 200 TMC లను తరలించుకునే కుట్ర జరుగుతుంది. మేడిగడ్డ పిల్లర్లు కుంగితే రిపేర్ లు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.నీళ్లు ఇవ్వకుండా KCR మీద కోపంతో రైతులను ఇబ్బందిపెడుతున్నారని ఫైరర్ అయ్యారు కవిత.
జూన్ 5న విచారణకు రావాలంటూ కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు వీలు కాదని..జూన్ 11న విచారణకు వస్తానని కేసీఆర్ కమిషన్ కు లేఖ రాశారు. దీనికి కమిషన్ కూడా ఒకే చెప్పింది.