బాల్క సుమన్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌‌‌‌ ఫిర్యాదు

బాల్క సుమన్పై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌‌‌‌ ఫిర్యాదు
  • ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  కార్యకర్తలను రెచ్చగొట్టిండు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: సింగరేణి ఆస్తులు తగులబెట్టా లని, రైలు పట్టాలు కోసెయ్యాలంటూ కేడర్​ను రెచ్చగొ ట్టిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆనంద్​కు ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ బుధవారం ఫిర్యాదు చేశారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ఎస్​ భవన్​లో బాల్కసుమన్​ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను డీజీపీకి అందించారు. అనంతరం డీజీపీ ఆఫీస్ ఆవరణలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు. 

బాల్క సుమన్​ మాటలు టెర్రరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకన్నా ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సుమన్​లాగే కేటీఆర్, హరీశ్​ రావు సైతం జనాలను రెచ్చగొడుతున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. బల్మూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేయాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్నదని ఆరోపించారు. 

సీఎం, మంత్రులకు వెంటనే సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.బాల్క సుమన్ వెనుక ఎవరున్నారు? ఆ కుట్రలను బయటపెట్టాలని డీజీపీని కోరామన్నారు. టెర్రరిస్టులా సుమన్ మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు. బాల్క సుమన్ ను వెంటనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్  చేయాలన్నారు. 

  • బీఆర్ఎస్​ పార్టీకి రైతులు, ప్రజల మద్దతు లేదని తేలిపోయింది

బీఆర్ఎస్ పార్టీకి రైతుల, జనం మద్దతు లేదని ఆ పార్టీ నేత బాల్క సుమన్ మాటల్లోనే తేలిపోయిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్​లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. చెన్నూరు ప్రజలకు పట్టిన శని బాల్క సుమన్ అని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అసాంఘిక శక్తిగా వ్యవహరిస్తున్న సుమన్ పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లే కారణమని ఆరోపించారు. అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. 

ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని ఎలా చెప్తాడని ప్రశ్నించారు.  బాల్క సుమన్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, అతన్ని వెంటనే అరెస్టు చేయాలని స్టేట్ లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్  కౌశిక్ డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని, సింగరేణి కార్మికులను, రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న సుమన్ తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. 

సుమన్ తీరుపై బీఆర్ఎస్ స్పందించాలని, ఆ పార్టీ స్టాండ్ ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని సాట్ చైర్మన్  శివసేనా రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే బాల్క సుమన్ ను రెచ్చగొట్టి ఆ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తుందని ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు  చేయడం దురదృష్టకరమన్నారు. వెంటనే సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు.