
లక్నో: మోటార్ రేసింగ్ ఫ్యాన్స్ను అలరించేందుకు ప్రతిష్టాత్మక మోటోజీపీ ఇండియాకు వచ్చేస్తోంది. ఇండియాలో తొలిసారిగా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్పై సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఈ మెగా టూవీలర్ రేసింగ్ జరగనుంది. ‘మోటోజీపీ– భారత్’ పేరిట జరిగే రేసు టికెట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ఆవిష్కరించారు. బుక్మై షోలో రూ. 800 నుంచి 40 వేల ధరల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆర్గనైజర్స్ తెలిపారు.