రచ్చకెక్కిన ’మా‘ ఎన్నికల వివాదం

 రచ్చకెక్కిన ’మా‘ ఎన్నికల వివాదం
  • నరేష్, కరాటే కళ్యాణిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

హైదరాబాద్: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రచ్చకెక్కి పోలీసు స్టేషన్ల దాకా వెళ్లింది. నటుడు, ’మా‘ మాజీ అధ్యక్షుడు నరేష్ తోపాటు, నటి కరాటే కళ్యాణిలు తన పరువుకి నష్టం వాటిల్లే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖయలు చేస్తున్నారంటూ నటి హేమ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నరేష్, కరాటే కళ్యాణిలు కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనపై అభ్యంతరకరమైన పదజాలంతో దూషించారని నటి హేమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నటి హేమ చేసిన ఫిర్యాదుపై స్పందించిన మాదాపూర్ పోలీసులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా నటి హేమ తమపై చేసిన ఆరోపణలను నటి కరాటే కళ్యాణి ఖండించారు.