తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు చెరువుల్లో పూడిక తీయలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. కరెంటు ఉన్నా.. నీళ్లు లేక, నీళ్లుంటే కరెంటు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని లేనివిధంగా రైతులకు సీఎం కేసీఆర్ 24 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు బంధు పేరుతో పెట్టుబడి అందిస్తున్నారని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల మధ్యలో సారవంతమైన నేల కల్గిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వృధాగా సముద్రంలో కలిసే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఫలితంగా తెలంగాణ అంతటా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తీస్తుంటేనే నీళ్లు వస్తున్నాయన్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగిందన్నారు. యాసంగి (రబీ) పంట దిగుబడి తీసుకుంటుందా లేదా అన్నది కేంద్రం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. రైతులను మోసగించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. అందరికీ తిండిపెట్టే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్రం, రాష్ట్రంపై ఉందన్నారు. కేంద్రం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో గోడౌన్లు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మతాలు, కులాలతో చిచ్చుపెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడేవన్నీ అవాస్తవాలేనని అన్నారు దయాకర్.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి పెరిగింది
- దేశం
- November 30, 2021
లేటెస్ట్
- క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
- ఇప్పుడంతా యూట్యూబ్ షార్ట్స్ పైనే సంపాదిస్తున్నారు
- బేవార్స్ కామెడీ ప్రాణం తీసింది : పురుషనాళంలోకి ఎలక్ట్రిక్ బ్లోడైయ్యర్ తో వేడి గాలి
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్