
- పూర్తి వివరాలు సమర్పించండి: పీఆర్,ఆర్డీ డైరెక్టర్ సృజన
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)ను వారి పూర్వపు జిల్లాలకు తిరిగి పంపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గత మే నెలలో తహసీల్దార్లకు జరిగిన బదిలీల మార్గదర్శకాలనే ఎంపీడీవోల బదిలీలకు అనుసరించనున్నారు.
జిల్లా పంచాయతీ అధికారులు (జడ్పీపీ), సీఈవోలు, తిరిగి వెళ్లాలనుకునే ఎంపీడీవోలు తమ వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మాలో గురువారం నాటికి తమకు పంపాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన ఆదేశించారు. ఇటీవల ఎంపీడీవోలు సచివాలయంలో మంత్రి సీతక్కను కలిశారు. తిరుగు బదిలీల్లో ఆప్షన్స్ ఇవ్వాలని, ఆంక్షలు లేకుండా బదిలీలు చేయాలని వినతి పత్రం అందజేశారు.