
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన మున్నూరుకాపులకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సంఘ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్లో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి గెలిచిన ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్నూరుకాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొంచెట్టి శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమురయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు కచ్చకాయల ఎల్లయ్య, చెలుకల తిరుపతి, పట్టణ అధ్యక్షుడు అజయ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహేశ్, బాలరాజు, డైరెక్టర్రాజు, అంజయ్య, కరుణాకర్, భిక్షపతి పాల్గొన్నారు.