
బిజినెస్ డెస్క్, వెలుగు: బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ ప్రస్తుతం తన ఆల్టైమ్ హై దగ్గర కదులుతోంది. ఈ లెవెల్ను ఈజీగా క్రాస్ చేస్తుందని, కొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. అంతేకాకుండా ఇంకో పన్నెండు నెలల్లో 20 వేల మార్క్ను కూడా టచ్ చేస్తుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 20,000 మార్క్ను టచ్ చేసే సత్తా నిఫ్టీకి ఉందని అవెండస్ క్యాపిటల్ సీఈఓ ఆండ్రూ హోలండ్ అంచనావేశారు. దేశ ఈక్విటీ మార్కెట్లపై ఎప్పుడూ లేనంత బుల్లిష్గా ఉన్నానని అన్నారు. కార్పొరేట్ ఎర్నింగ్స్ మెరుగుపడతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ‘
మార్కెట్ పెరగడానికి ఎర్నింగ్స్ కెటలిస్ట్ (బూస్ట్) గా పనిచేయాలి. ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో కార్పొరేట్ కంపెనీల ఎర్నింగ్స్ మెరుగవుతాయని అంచనావేస్తున్నాం. మనం బుల్ మార్కెట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ మధ్య నిఫ్టీ 20 వేల మార్క్ను టచ్ చేస్తుంది. ఇది కేవలం 10 శాతం గ్రోత్కు సమానం. భారీ పెరుగుదలేం కాదు’ అని హోలండ్ వివరించారు. నిఫ్టీ శుక్రవారం 18,826 దగ్గర కొత్త క్లోజింగ్ రికార్డ్ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆల్టైమ్ హై 18,888 కంటే కేవలం 0.3 శాతం దూరంలోనే ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ ఉంది.
గ్లోబల్గా మంచి పొజిషన్లో..
అవెండస్ క్యాపిటల్కు చెందిన రెండు ఈక్విటీ ఫండ్స్ను హోలండ్ చూసుకుంటున్నారు. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ఇక నుంచి ఆపుతాయని నమ్ముతున్నారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతోందని చెప్పారు. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను తగ్గించాల్సి వస్తుంది. నాన్స్టాప్గా వడ్డీ రేట్లను పెంచడంతో దీని ప్రభావం ఆ దేశ బ్యాంకింగ్ సెక్టార్పై తీవ్రంగా ఉంది.
మానిటరీ పాలసీని కఠినం చేస్తూ ఉండడంతో ఫెడ్కు, యూఎస్ ట్రెజరీకి కంట్రోల్ తక్కువ ఉన్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఇబ్బంది పడుతోంది. ఈ సెగ్మెంట్ చాలా పెద్దది. ఆందోళనగా ఉంది’ అని హోలండ్ పేర్కొన్నారు. ప్రపంచం మళ్లీ గ్రోత్కు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎమెర్జింగ్ మార్కెట్లు ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉన్నా ఆకర్షణీయంగా ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఫైనాన్షియల్స్పై హోలండ్ బుల్లిష్గా ఉన్నారు.
23,800 వరకు..
మాక్రో ఎకానమీ బాగుండడంతో పాటు విదేశీ పెట్టుబడులు రావడంతో నిఫ్టీ గత రెండు నెలల్లో 5 శాతం రిటర్న్ ఇచ్చిందని బ్రోకరేజి కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. రెపో రేట్ల పెంపును ఆపడం, ఇన్ఫ్లేషన్ తగ్గుతుండడం, జీడీపీ అంచనాలు మెరుగ్గా ఉండడం, కంపెనీల క్యాపెక్స్లు పెరుగుతుండడం, ప్రభుత్వం ఇన్ఫ్రా సెక్టార్పై భారీగా ఖర్చు చేయనుండడంతో ఇండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందని వివరించింది. వచ్చే 12 నెలల్లో నిఫ్టీ 21,000 లెవెల్ను టచ్ చేస్తుందని లెక్కించింది. బుల్రన్ వస్తే ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ 23,878 వరకు పెరుగుతుందని, బేరిష్ మూడ్ ఉంటే 17,909 వరకు పడొచ్చని పేర్కొంది.
ఆటో, బ్యాంకులు, ఐటీ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్ సెక్టార్లపై ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. మెటల్స్, సిమెంట్, కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్స్ సెక్టార్లపై అండర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో నిఫ్టీ నష్టపోయినప్పటికీ, ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2.7 శాతం రిటర్న్ ఇచ్చింది. ‘రబీ సీజన్ బాగుండడంతో రూరల్ డిమాండ్ పుంజుకుంటోంది. ఇన్ఫ్లేషన్ దిగొస్తోంది. ఇవి పాజిటివ్ అంశాలు. ఎల్నినో, 2024 ఎలక్షన్స్ అతిపెద్ద ఛాలెంజ్గా ఉన్నాయి’ అని ప్రభుదాస్ లీలాధర్ పేర్కొంది. అపార్ ఇండస్ట్రీస్, మారికో, నవ్నీత్ ఎడ్యుకేషన్ షేర్లకు రేటింగ్స్ అప్గ్రేడ్ చేసింది.
డా.రెడ్డీస్, గ్లెన్మార్క్, వోల్టాస్, సిటీ యూనియన్ బ్యాంక్, అవాస్ ఫైనాన్షియర్స్, ఛంబల్ ఫెర్టిలైజర్స్, లక్ష్మీ ఆర్గానిక్స్ షేర్ల రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసింది. పెద్ద కంపెనీల్లో డీమార్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను, మిడ్, స్మాల్క్యాప్ సెక్టార్లో అశోక్ లేలాండ్, సుమిటోమో కెమికల్స్, అపార్ ఇండస్ట్రీస్, అస్టర్ డీఎం హెల్త్కేర్, చాలెట్ హోటల్స్, నజర్ టెక్ షేర్లను రికమండ్ చేస్తోంది.