దగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం 

దగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం 
  • లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్!

బషీర్​బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్​లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకాలేదు. తన హోటల్​ను అక్రమంగా కూల్చివేశారని హోటల్ యజమాని నందు కుమార్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో దగ్గుబాటి సురేశ్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా గత ఐదు వాయిదాలలో నాంపల్లి కోర్టులో హాజరుకాలేదు. హాజరుకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దగ్గుబాటి కుటుంబం తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్​ను న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది.

ఈ నెల 23న తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ నెల 23న తప్పనిసరిగా న్యాయస్థానం ముందు దగ్గుబాటి కుటుంబం హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.