నిర్మల్ జిల్లాలో ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్

 నిర్మల్ జిల్లాలో ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్

నిర్మల్, వెలుగు: ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద సోమవారం ఉదయం అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్ జ్యోతి వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఆర్డీవో కార్యాలయం వరకు, అక్కడి నుంచి తిరిగి స్టేడియం వరకు సాగింది. విద్యార్థులు, క్రీడాకారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ రన్‌ను నిర్వ హించినట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు.

 కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎసీబీఈ పరమేశ్వర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, పెటా ప్రెసిడెంట్ భూక్య రమేశ్, సెక్రటరీ భోజన్న, ఎంఈవో నాగేశ్వర్ రావు, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

క్రీడలతో ఏకాగ్రత

నస్పూర్, వెలుగు: క్రీడలతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందుతుందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఒలంపిక్ డే రన్- 2025లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి జడ్పీ బాలుర హైస్కూల్​ గ్రౌండ్​వరకు నిర్వహించిన రన్​లో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హన్మంతరెడ్డి, ఏసీపీ ప్రకాశ్, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గాప్రసాద్​తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు కొంత సమయాన్ని వ్యాయామం, క్రీడలకు కేటాయించాలని, తద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు.