
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆదివారం పాట్నా హైకోర్టు జడ్జి గున్ను అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు స్వామివారి వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈఓ వెంకటేశ్ స్వామివారి ఫొటోను బహూకరించారు.
కార్యక్రమంలో ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సిద్దిపేట జడ్జి సాధన, ఎస్ఐ రాజు, సిద్దిపేట కోర్టు సూపరింటెండెంట్శ్రీహరి, చేర్యాల కోర్టు సూపరింటెంండెంట్సుధాకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.