గుజరాత్ లో రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు

గుజరాత్ లో  రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు

న్యూఢిల్లీ: ఇవాళ ప్రారంభం కానున్న న్యాయ శాఖ మంత్రుల సదస్సులో పీఎం మోడీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ మేరకు పీఎంవో ప్రకటన విడుదల చేసింది. కేంద్ర న్యాయ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ లోని ఏక్తా నగర్ లో జరిగే ఈ సదస్సుకు పలు రాష్ట్రాల నుంచి న్యాయ శాఖ  మంత్రులు, కార్యదర్శులు హాజరుకానున్నారు.

న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని పీఎంవో తెలిపింది. సత్వర న్యాయం అందించేందుకు మార్గాలు, రాష్ట్రాల మధ్య న్యాయ సంబంధమైన సమస్యలను పరిష్కరించడం వంటి వాటిపై ఈ సదస్సులో చర్చించనున్నారు.