
- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బీర్కూర్, వెలుగు: విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేసి, మౌలిక వసతులపై ఆరా తీశారు. రెండు రోజుల కింద పాఠశాల ఆవరణ లో లెక్చరర్ మామిడి స్వప్న మృతి చెందగా, రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ.26 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అంతకుముందు బీర్కూర్ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో స్టూడెంట్లకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, ఆర్సీవో సత్యనారాయణ రెడ్డి, ఆఫీసర్లు, లీడర్లు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో అందజేశారు. బాన్సువాడ, బిర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, పోతంగల్, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు రూ 35 లక్షల విలువ గల చెక్కులను అందజేశారు . కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఉన్నారు.