లాంగ్ డ్రైవ్ కార్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం..

లాంగ్ డ్రైవ్ కార్స్ కేసులో పోలీసుల విచారణ వేగవంతం..

లాంగ్ డ్రైవ్ కార్స్ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం డాడికి పాల్పడ్డ 8 మందిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు హరిదీప్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హరిదీప్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. 

తమ సంస్థలో విధులు మానేసి మరో సంస్థలో ఉద్యోగ అవకాశానికి వెళ్తున్నందున 20 మంది యువతీ, యువకులను రూంలో బంధించి చిత్రహింసల పెట్టారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచక్షణారహితంగా కొట్టి రూంలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.